వ్యవసాయమంత్రి నిరంజన్రెడ్డి
బుసిరెడ్డిపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం
హాజరైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి
పాన్గల్, ఫిబ్రవరి 9: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతులందరినీ సంఘటితం చేసేందుకే నిర్మించిన రైతువేదికలు భవిష్యత్లో క్రీయాశీలకంగా మారుతాయని వివరించారు. మండలంలోని మల్లాయిపల్లిలో నూతనంగా నిర్మించిన రైతువేదికను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. బుసిరెడ్డిపల్లిలో 33/11 విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ప్రతి గుంటకూ నీరందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ మాటల వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మోదీ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సాగునీటి అవసరాల నిమిత్తం మల్లాయిపల్లిలో తిమ్మాయిచెరువు మరమ్మతుకు రూ.10 లక్షలు ఏసీడీపీ నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే బీరం హామీ ఇచ్చారు. అ నంతరం గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మి, వైస్ఎంపీపీ కవిత, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మునీరొద్దీన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకటయ్యనాయుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాముయాదవ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్నాయక్, దశరథ్నాయుడు, రఘుపతినాయుడు, సర్పంచులు బాలస్వా మి, విష్ణు, మేస్త్రీ రాములు, తాసిల్దార్ చాంద్పాషా, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
వనపర్తి, ఫిబ్రవరి 9: మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ (ఎన్జీవో) కంపెనీ వనపర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ముందుకొచ్చింది. టాయిలెట్స్, కిచెన్ షెడ్ల నిర్మాణం, డ్యూయల్ డెస్క్ బెంచీలు, సోలార్ వాటర్ హీటర్స్, పెయింటింగ్ వేయించటం వంటి అంశాలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్నట్లు కంపెనీ సభ్యు లు తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ శ్రీనివాసులును మంత్రి నిరంజన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో అభినందించారు.