జోగులాంబ గద్వాల : జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లాభాయి పటేల్ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ సమావేశం హాలులో పటేల్ చిత్రపటానికి కలెక్టర్ వల్లూరు క్రాంతి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిజాం మెడలు వంచి భాగ్యనగరాన్ని నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుండి విముక్తి చేసిన ఉక్కు మనిషి పటేల్ అన్నారు. ఒక్క భాగ్యనగరాన్నే కాక జునాఘడ్ వంటి అనేక సంస్థానాలను భారత్ లో విలీనం చేశాడన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, తదితరులు పాల్గొన్నారు.