జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్లో శ్రీ భీమ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సోమవారం భూమి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు భక్తిభావం అలవర్చుకోవాలన్నారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.