ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీచుపల్లి క్షేత్రములోని లక్ష్మీహయగ్రీవ జ్ఞాన సమేత సరస్వతి అమ్మ వారు రెండో రోజు ధనలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చింది.
ఆలయ అర్చకులు భువనచంద్ర సుప్రభాతసేవ, తిరువారాధన, కుంకుమార్చన, నైవేధ్య నిరాజనాలు, అన్నప్రాసన, అక్షరా భ్యాసం, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ మేనేజర్ సురేందర్రాజు పర్యవేక్షించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో పూజలందుకొన్నారు.