అయిజ రూరల్: అలంపూర్ నియోజకవర్గంలో విధ్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. గురువా రం మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో జడ్పీటీసీ నిధులు రూ. 5లక్షలతో నిర్మిస్తున్న పాఠశాల అదనపు గది నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్దన్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యాపదిన్నె పాఠశాలకు అదనపు తరగతి గది ఆవశ్యకత ఏర్పడిందని గ్రామస్తులు నా దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ఇందుకు గాను జడ్పీటీసీ నిధుల నుంచి అదనపు తరగతి గది నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. దీంతో అదనపు గదుల సమస్య తీరనుందని చెప్పారు.
అనంతరం పాఠశాలలో 6,7,8 తరగతులు చదువుతున్న విధ్యార్థులలో కనీస సామర్థ్యాల పెంపుదలపై అదనపు కలెక్టర్ శ్రీహర్ష చేపట్టిన భూమిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. కార్య క్రమంలో సర్పంచ్ ఇన్సెంట్, సింగిల్విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎక్లాస్పురం నర్సింహా రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ప్రహ్లదరెడ్డి, రవిరెడ్డి, ఆంజనేయులు, ఎంఈవో నర్సింహులు, ఉపాధ్యాయులు విధుర్కుమార్, ప్రభా కర్, ఫకీరన్న, సురేశ్, బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.