అయిజ: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గురువారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల అదనపు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయిజ మున్సిపాలిటీ, మండల ప్రజలతో పాటు వడ్డేపల్లి, రాజోళి మండలాల ప్రజలకు అయిజ పీహెచ్సీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
జిల్లాలోనే అత్యధికంగా అయిజ పీహెచ్సీలో కాన్పుల సంఖ్య అధికంగా ఉండటంతో 30 పడకల అదనపు గదులు నిర్మించేందుకు ప్రభుత్వం కేసీఆర్ కిట్టు ఫండ్ కింద సీఎం కేసీఆర్ రూ. 80 లక్షల నిధులను విడుదల చేశారన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందన్నారు.
నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధికై ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అయిజ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కలిసికట్టుగా అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలన్నారు.అయిజ మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎన్నడు లేనంతగా డ్రైనేజీలు, సీసీ రహదారుల నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, వైస్ చైర్మన్ మాల నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మధుసూధన్రెడ్డి, డీఈ రాఘవన్, ఏఈ అబ్దుల్ రహీం, డాక్టర్లు సయ్యద్ ఇర్షాద్, స్వరూపారాణి, మాజీ ఎంపీపీ సుందర్రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ రాముడు, కౌన్సిలర్లు అనిత, నర్సింహులు, వెంకటేశ్, రాణెమ్మ, ఆంజనేయులు, టీఆర్ఎస్ పట్టణ, మండల నాయకులు రఘునాథ్రెడ్డి, మహబూబ్ భాష, రమేశ్, నర్సింహారెడ్డి, ప్రహ్లాదరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.