ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా
పోలీసులంటే నమ్మకం కలిగేలా పనిచేస్తా
తప్పు చేస్తే ఎవరైనా సహించేది లేదు..
‘నమస్తే తెలంగాణ’తో నాగర్కర్నూల్ ఎస్పీ మనోహర్
నాగర్కర్నూల్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్ర జలకు అనునిత్యం అందుబాటులో ఉంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ నా నైజం. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్రమశిక్షణ పాటించాలి. ప్రజలు కూడా శాంతిభద్రతల పరిరక్షణకుగానూ పోలీసులు తీసుకునే చర్యలకు సహకరించాలి. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులు’ అని నాగర్కర్నూల్ ఎస్పీ మనోహర్ తెలిపారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
నమస్తే తెలంగాణ : ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా అమలు చేస్తారు..?
ఎస్పీ మనోహర్ : ఫిర్యాదుదారులతోపాటు ప్రజలతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలి. చట్ట ప్రకారం రాజకీయ ప్రమేయం లేకుండా వ్యవహరించాలి. ఎక్కడా అవినీతికి పాల్పడకూడదు. పోలీస్స్టేషన్కు వస్తే బాధితులకు న్యా యం జరుగుతుందన్న నమ్మకం కలిగించేలా చ ర్యలు తీసుకుంటా. కొత్తగా వచ్చినందున గతంలోని పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన లేదు. నిబంధనల ప్రకారం అందరూ విధులు నిర్వహించాలి. ఇతర ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురి కాకుండా నిబద్ధతతో పని చేయాలి. అనవసర వివాదాల్లో తలదూరిస్తే సహించను.
డ్రగ్స్, ఇసుక, భూదందా, గుడుంబా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?
ఎస్పీ : ఎక్కడైనా అక్రమాలు, అన్యాయాలు జరిగితే పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలి. అ త్యవసర సమయాల్లో ఫోన్ చేసి కూడా సమాచారం అందించొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం.
నేరాలను ఎలా కట్టడి చేస్తారు..?
ఎస్పీ : నేరం జరిగిన వెంటనే ఆధారాలు సేకరిస్తాం. సాక్ష్యాలు సేకరించేందుకు ఎస్హెచ్వోలకు ఆదేశాలు జారీ చేస్తాను. అవసరమైతే పీడీయాక్డ్ సైతం నమోదు చేస్తాం. తప్పులు చేసేందుకు భయపడేలా కఠినంగా వ్యవహరిస్తాం.
ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏం చేస్తారు..?
ఎస్పీ : స్టేషన్లకు వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదు లు స్వీకరించి వెంటనే న్యాయం చేసేలా ఎస్సైల కు ఆదేశాలు జారీ చేస్తా. విలేజ్ పోలీసింగ్ అమలయ్యేలా చూస్తాను. కమ్యూనల్, ఇతర సభలు, సమావేశాల సమయాల్లో ఇబ్బందులు కలగకుం డా చూస్తాం. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యం. ప్రతి సోమవారం జిల్లా కా ర్యాలయంలో ప్రజావాణి ఉంటుంది. డీఎస్పీలు కూడా ఉంటారు. సమస్యలుంటే ప్రజలు ధైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు.
మహిళల సమస్యలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకునే చర్యలేంటి..?
ఎస్పీ : మహిళలు సమస్యలను వివరించేందు కు ముందుకు రావాలి. వేధింపులు ఎదురైతే ఫో న్లో సైతం ఫిర్యాదు చేయొచ్చు. షీ టీంలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఆపరేషన్ స్మైల్తో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్య లు తీసుకుంటున్నాం. మైనర్లను ఎవరూ పనిలో పెట్టుకోవద్దు. బాలబాలికలు పాఠశాలల్లో మాత్ర మే ఉండాలి.నిత్యం ఉదయం 10 నుంచి సా యంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉం టాను. కార్యాలయానికి నేరుగా వచ్చినా కలుస్తా. పోలీసులంటే నమ్మకం కలిగించేలా పనిచేస్తా.