దూద్ దవాఖాన, మహిళా కేంద్రం ప్రారంభం
మహబూబ్నగర్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పర్యటన
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 27: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు ప్రాంతంలో రూ.కోటితో నిర్మించిన దూద్ దవాఖానను సోమవారం మంత్రి ప్రారంభించారు. పాత పాలమూరు, వీరన్నపేట, బండ్లగేరి, బ్రాహ్మణవాడి తదితర ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా దూద్ దవాఖానను అందుబాటులోకి తీసుకొచ్చామనారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు, కనీసం నెలకు ఒకసారైన పరీక్షించుకోవాలన్నారు. దవాఖానలో ప్రతిరోజూ మహిళా డాక్టర్, చిన్న పిల్లల డాక్టర్ ఉండేలా చూస్తామని, సాధారణ కాన్పులు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజు రక్త పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ టెక్నీషియన్ను ఏర్పాటు చేయాల్సిందింగా డీఎంహెచ్వోను ఆదేశించారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఆభివృద్ధి చెందేందుకు మహిళా కేంద్రంలో అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వచ్చేవారమే 25నుంచి 30కుట్టుమిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్, కౌన్సిలర్ వేదవ్రత పాల్గొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి కృషి..
మహబూబ్నగర్, డిసెంబర్ 27 : గిరిజనులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పద్మావతీకాలనీలోని అయ్యప్పకొండపై రూ.కోటీ 10లక్షలను వెచ్చించి ఏర్పాటు చే యనున్న గిరిజన భవన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అ న్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నా రు. తండాలను పంచాయతీలుగా మార్చడం ద్వారా గి రిజనులు సర్పంచులు అయ్యారని, ప్రతి పంచాయతీకి కార్యదర్శులు అందుబాటులోకి వచ్చారని గుర్తు చేశారు. గిరిజనులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకునేందుకు గిరిజన భవన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపా రు. 8 నెలల్లో భవనం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెట్టుగడ్డ వద్ద ఉన్న పాత గిరిజన భవన మరమ్మతులు చేసేందుకుగానూ రూ.10లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావు, డీటీడీవో చత్రు, గిరిజన సేవా సం ఘం అధ్యక్షుడు రాజూనాయక్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి చందర్నాయక్, దేవుజానాయక్, రవీందర్, ఈఈ వసంత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఘనంగా నిర్వహించాలి..
హన్వాడ మండలంలోని గోండ్యాల్ గ్రామంలో వెలసిన తిరుమలనాథస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి స్వగృహంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వెంకటయ్య, వండ్ల శేఖర్ పాల్గొన్నారు.
సగర సంఘం సభ్యులకు అభినందన..
మహబూబ్నగర్ జిల్లా నూతన సగర సంఘం కమి టీ సభ్యులను మంత్రి శ్రీనివాస్గౌడ్ తన స్వగృహంలో అభినందించారు. సోమవారం కమిటీ సభ్యులు మం త్రిని కలిసి సన్మానించారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సగర సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్సాగర్, జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, కార్యదర్శి సత్యం, కోశాధికారి నారాయణ, మహిళా కమిటీ సభ్యులు పద్మావతి, అలివేలు, వెంకటేశ్వరమ్మ, యూత్ కమిటీ సభ్యులు తరుణ్, మల్లేశ్, గోవర్ధన్ ఉన్నారు.