టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తా
పార్టీశ్రేణులకు ఎల్లవేళలా అండగా ఉంటా..
పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తా..
ఉనికి కోసం పాకులాడుతున్న ప్రతిపక్షాలు
‘నమస్తే తెలంగాణ’తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల
నమస్తే తెలంగాణ : జిల్లా అధ్యక్ష పదవిపై ఎలా ఫీలవుతున్నారు..?
బండ్ల కృష్ణమోహన్రెడ్డి : సీఎం కేసీఆర్ నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇది పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. అందరి సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తా.
నమస్తే తెలంగాణ : పార్టీ పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?
బండ్ల కృష్ణమోహన్రెడ్డి : ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల కంటే బలంగా ఉన్నది. అక్కడక్కడ కొందరు నాయకులు, కార్యకర్తల మధ్య అసంతృప్తి ఉంది. అయితే, పార్టీ కుటుంబంలాంటింది. ఇలాంటివి సహజం. వారి అసంతృప్తికి గల కారణాలు తెలుసుకొని పార్టీ కోసం పనిచేసేలా ప్రయత్నిస్తా. జిల్లాలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తా.
పతిపక్షాల విమర్శలను ఎలా తిప్పి కొడతారు..?
బండ్ల కృష్ణమోహన్రెడ్డి : పార్టీ గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు. వాళ్లు తమ ఉనికి కోసం పసలేని ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నింటికీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే సమాధానం చెబుతుంది. ప్రతి పక్షాలు చేసే విమర్శలకు ఘాటుగానే స్పందిస్తాం. టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న పనుల గురించి ప్రజలకు బాగా తెలుసు.
కార్యకర్తలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు..?
బండ్ల కృష్ణమోహన్రెడ్డి : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. జిల్లాలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా అండగా ఉంటా.ర్టీకి కార్యకర్తల అండే కొండంత బలం. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. పార్టీ చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చే విధంగా చర్యలు తీసుకుంటా.