మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదాం
రూ.23కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో మరింత ప్రగతి
మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 23 : ఉమ్మడి జిల్లాలో జడ్చ ర్ల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని ప్రేమ్రంగా గార్డెన్ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధం గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీలో కొత్తగా రూ.23కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. అలాగే మిషన్ భగీరథ నీటిని ప్రతిరోజూ సరఫరా చేస్తామన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించి వందశాతం ఆస్తిపన్ను వసూలుకు కౌన్సిలర్లు సహకరించాలని సూచించారు. అలాగే ము న్సిపాలిటీలో పందులు లేకుండా చర్యలు తీసుకోవాల ని, పందులు లేని వార్డులకు రూ.50వేల అవార్డు ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కో రారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. ముడాను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యావాదాలు తెలిపారు.
రూ.9.54కోట్లతో మున్సిపల్ బడ్జెట్
జడ్చర్ల మున్సిపాలిటీ 2022-23 బడ్జెట్ను మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ కమిషనర్ సునీత తదితరులు ఉన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
బాలానగర్, ఫిబ్రవరి 23 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా రు. మండలంలోని గౌతాపూర్లో సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే మండలకేంద్రంలో నాగర్కర్నూల్ ఎంపీ రాములుతో కలిసి రైతు ఆగ్రో సేవాకేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి వాల్యానాయక్, గిరిజన నాయకుడు లక్ష్మణ్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, యూత్వింగ్ అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, వైస్ఎంపీపీ వెంకటాచారి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, జెడ్పీటీసీ భరత్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, లక్ష్మణ్నాయక్, భూపాల్, అరుణ్కమార్, జగన్నాయక్, బాలూనాయక్ ఉన్నారు.
విద్యా, వైద్యరంగానికి పెద్దపీట
రాజాపూర్, ఫిబ్రవరి 23 : ప్రభుత్వం విద్యా, వైద్యరంగానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా రు. రాజాపూర్ పీహెచ్సీలో ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఆశ కార్యకర్తలు అందించిన సేవలు మరవలేనివన్నారు. ప్రజల కు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా మండలకేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ గాడ్గేబాబా జయంతి వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాడ్గేబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుశీల, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, డాక్టర్ ప్రతాప్చౌహాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, రజక సంఘం మం డల అధ్యక్షుడు శంకర్, నాయకులు నరహరి, వెంకట్రాంరెడ్డి, రమేశ్నాయక్, మహిపాల్రెడ్డి, యాదగిరి, విజయ్, దేవేందర్, సత్యయ్య, వెంకటయ్యగౌడ్, కృష్ణ య్య, శ్రీశైలం, రాజు, రాము పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
మిడ్జిల్, ఫిబ్రవరి 23 : గ్రామీణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా రు. మండలంలోని రాణిపేటలో సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే అయ్యవారిపల్లిలో నిర్వహించిన బొడ్రాయి పండుగలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు నిరంజన్, జంగారెడ్డి, సునీత, ఎంపీటీసీ సుదర్శన్, టీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, బాలు, శ్రీనివాసులుగుప్తా, ఎల్లయ్యయాదవ్, నర్సింహారెడ్డి, హరిప్రసాద్, బంగారు, నవీనాచారి, విజయ్, నరేశ్ ఉన్నారు.
తాసిల్దార్కు పరామర్శ
జడ్చర్ల, ఫిబ్రవరి 23 : జడ్చర్ల తాసిల్దార్ లక్ష్మీనారాయణ తల్లి కమలమ్మ ఇటీవల మృతి చెందారు. విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి షాద్నగర్లో తాసిల్దార్ను పరామర్శించారు. ముందుగా కమలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, మండల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి ఉన్నారు.