గద్వాల న్యూ టౌన్, సెప్టెంబర్ 21 : జోగుళాంబ గద్వాల జిల్లా లో రేషన్ బియ్యం దందా మా త్రం ఆగడం లేదు. ప్రతి నెలా వంద ల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పక్కదారి ప డుతున్నాయి. కేసులు నమోదవుతున్నా.. దళారు లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 70 కేసుల్లో 1624.69 క్వింటాళ్లకు పైగా బియ్యం స్వా ధీనం చేసుకోగా, 106 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బయోమెట్రిక్ విధానం వచ్చినా.. బియ్యం దందా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా కొనసాగుతుండడం గమనార్హం. ఈ తతంగంపై డీ లర్లు, అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డీలర్లదే హవా..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 333 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఇందులో చాలా దుకాణాల్లో రెగ్యులర్ డీలర్లు లేరు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు షాపులకు ఇన్చార్జిలుగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 52 మంది ఇన్చార్జి డీలర్లుగా కొనసాగుతున్నారు. డీలర్లకు, అక్రమార్కులకు నాయకులు, అధికారుల అండదండలు ఉండడంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లుల్లో యథేచ్ఛగా రీసైక్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. రేషన్ షాపు పక్కనే మరో దుకాణాన్ని తీసుకొని బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాంలకు తరలిస్తున్నారు. కొందరు మిల్లుల యాజమానులు సంబంధిత అధికారుల కార్యాలయాల్లోనే ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1624.69 క్వింటాళ్లకు పైగా బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కానీ, గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే కొన్ని వేల క్వింటాళ్లు తరలిందని సమాచారం. బియ్యం అక్రమ దందాలపై ఇటీవల పత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో ఈనెల 8వ తేదీన డీలర్లతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా, గద్వాల శివారులోని రేఖా రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టుబడి 11 నెలలు గడిచినా.. ఈ కేసు ఎటూ తేలకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై డీఎస్వో రేవతిని వివరణ కోరగా.. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపును నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మా దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, బియ్యం పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. రేషన్ దుకాణాలపై నిఘా పెట్టామని చెప్పారు.
ముఠాగా ఏర్పడి సేకరణ..
గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు, అయిజ, మల్దకల్, ఇటిక్యాల, మానవపాడు, అలంపూర్, వడ్డేపల్లి తదితర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించేందుకు కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడ్డారు. రేషన్ బియ్యాన్ని తినలేని చాలా మంది లబ్ధిదారులు వీరికి అమ్ముతున్నారు. అంతే కాకుండా, లబ్ధిదారులు నేరుగా దుకాణాల్లోనే డీలర్లకు కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. బియ్యాన్ని కొనుగోలు చేసిన డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా ఇదే బియ్యాన్ని దళారులకు రూ.15కు పైగా అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన బియ్యాన్ని దళారులు రైస్మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతోపాటు రాయిచూర్, ఆంధ్రప్రదేశ్కు లారీలు, డీసీఎంలలో తరలిస్తున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన సివిల్ సైప్లె, పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాఫియాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాత్రికి రాత్రే బియ్యం పక్కదారి పడుతున్నది. కొన్ని చోట్ల బియ్యాన్ని తరలిస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, ఈ కేసులన్నీ నామమాత్రమే కావడంతో దళారులు మళ్లీ దందా కొనసాగిస్తున్నారు. ఇక డీలర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసే ముందు.. లబ్ధిదారులతో కందిపప్పు, గోధుమ పిండి, వంటనూనె తీసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నరు. వాస్తవానికి చౌకధర దుకాణాల్లో సబ్సిడీ బియ్యాన్ని మాత్రమే అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కొందరు డీలర్లకు కిరాణా దుకాణాలు ఉండడంతో నిత్యావసర సరుకులను ఎక్కువ ధరకు రేషన్ షాపుల్లోనే విక్రయిస్తున్నారు.
ఇటీవల స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యం వివరాలు..