ఆశవర్కర్లు మెరుగైన సేవలందించాలి
ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 19: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆశవర్కర్లకు గుర్తింపు వచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆశవర్కర్లు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను అందజేస్తున్నదన్నారు. జడ్చర్ల ఆర్బన్ హెల్త్సెంటర్ పరిధిలో పనిచేస్తున్న 48మంది ఆశవర్కర్లకు శనివారం ఎమ్మెల్యే స్మార్ట్ఫోన్లను అందజేసి మాట్లాడారు. కరోనా సమయంలో ముందుండి వైద్య సేవలందించిన వైద్యశాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆదర్శప్రాయుడు.. ఛత్రపతి శివాజీ
ఛత్రపతి శివాజీ సమాజానికి ఆదర్శప్రాయుడు అని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా శనివారం జడ్చర్లలో శివాజీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా కావేరమ్మపేట గ్రంథాలయం వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాదేపల్లి పాతబజార్ హనుమాన్ ఆలయం వద్ద శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రదర్శనలను తిలకించారు. అనంతరం శివాజీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, సంగీత,నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, కౌన్సిలర్లు, శివాజీ సంఘం సభ్యులు, డీఎంహెచ్వో కృష్ణ, అదనపు డీఎంహెచ్వో శ్రీధర్, డీఎంవో విజయ్కుమార్, జడ్చర్ల ఆర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్, నర్సింహారెడ్డి, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
రాజాపూర్, ఫిబ్రవరి 19: సీఎం కేసీఆర్ అశోకుడి పాలనను మరిపించేలా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం చెన్నవెల్లిలో మొక్కలు నాటి సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రాజులు చేసిన పరిపాలనను పుస్తకాల్లో చ దువుకున్నామని, నేడు సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీ మోహన్నాయక్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, సర్పంచ్ రాధా వెం కట్రాంరెడ్డి, ఎంపీటీసీ మాసమ్మ, నాయకులు రమేశ్నాయక్, మహిపాల్రెడ్డి, శేఖర్రెడ్డి, యాదగిరి, విజ య్, దేవేందర్, శేఖర్రెడ్డి, యాదిరెడ్డి, జంగయ్య, సత్య య్య, ఆనంద్గౌడ్, వెంకట్రాంరెడ్డి, వెంకటయ్యగౌడ్, కృష్ణయ్య, శ్రీశైలం, రాజు, రాములు, సర్పంచులు, నా యకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.