గద్వాల రూరల్, డిసెంబర్ 30 : కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు విషయం లో రైతులను కేంద్రం దగా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని గద్వాల ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ప్రతాప్గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్లు కొనబోమంటూ రైతును బీజేపీ సర్కారు ముప్పతిప్పలు పెడుతున్నదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ మాత్రం వారికి అండగా నిలిచారన్నారు. యాసంగి సాగు పంట పెట్టుబడికి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమవుతున్నాయని తెలిపారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారన్నారు. రైతును లక్షాధికారిని చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గతంలో వ్యవసాయమంటే దండగ అనేటోళ్లని.., నేడు పండుగలా మారిందని చె ప్పారు. గతంలో పట్టణాలకు వలస వెళ్లిన నడిగడ్డ రైతులు నేడు సొంత ఊర్లకు చేరుకు ని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలు ఇక్కడికి వలస వస్తున్నారని వివరించారు. సకాలంలో రైతుబంధు సాయం అందించిన సీఎం కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ సుభాన్, ఎంపీపీ ప్రతాప్గౌడ్, మార్కెట్ యార్డు చైర్పర్సన్ రామేశ్వరమ్మ, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ దామోదర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి, సర్పంచులు వాసు, మన్యం, టీఆర్ఎస్ నాయకులు రమేశ్ నాయుడు, గంగన్న, మన్యస్వామి, సత్యనారాయణ, శాంతిరాజు, లక్ష్మన్న, కృష్ణ, నీలేశ్వర్రెడ్డి, హనుమంత్రెడ్డి, సత్యారెడ్డి, రఘురెడ్డి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.