హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్
పనులు ప్రారంభమైన తొమ్మిది నెలల్లోగా పూర్తిచేస్తాం
మన ఊరు-మన బడి’లో భాగస్వాములు కావాలి
వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
పెద్దమందడి, ఫిబ్రవరి 23 : కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని ఆయా గ్రా మాల్లో చేపట్టిన వివిద అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి శం కుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మనిగిల్ల పాఠశాలలో అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులను ప్రారంభించారు. బలిజపల్లి గ్రామ పాఠశాలకు మంత్రి తన సొంత ఖర్చులతో (రూ.2.5లక్షలు) కొనుగోలు చే సిన డిజిటల్ ప్యానల్ బోర్డును వితరణ చేశారు. జంగమాయిపల్లి కొమ్ములగట్టు వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు రూ.కోటితో నిర్మించనున్న బీటీ రహదారికి శంకుస్థాపన చేశారు. వైకుంఠధామాన్ని ప్రారంభించారు. బలిజపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భ వనం, పల్లె దవాఖానను ప్రారంభించారు. చీకర్చెట్టు తండా, ముందరితండాలో గిరివికాస పథకం ద్వారా చేపట్టిన బోరు మోటార్లను ప్రారంభించారు. జంటగ్రామాల జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పామిరెడ్డిపల్లి, ముందరితండా, చీకర్చెట్టు తండా, దొడగుంటపల్లి, మనిగిల్ల గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. ఆయా గ్రామాల్లో వైకుంఠధామాలు, పాఠశాల అదనపు తరగతి గదులను ప్రా రంభించారు. జగత్పల్లిలో వాగు వద్ద బ్రిడ్జీ నిర్మాణ ప నులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నెతండా లిఫ్ట్ పూర్తయితే ఖిల్లాఘణపు రం మండలంలోని రెండు గ్రామాలు, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్కు ఎగువన ఉన్న జంగమాయిపల్లి, బలిజపల్లి, పామిరెడ్డిపల్లి గ్రామాలకు సాగునీరందుతుందన్నారు. పనులు ప్రారంభమైన 6 నుంచి 9 నెలల్లో పూర్తిచేస్తామన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వి రాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలన్నా రు. గ్రామాల్లో ప్లాస్టిక్ నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు. పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు దినపత్రికల్లోని ముఖ్యంశాలు చదవాలన్నారు. ఎంపీపీ మేఘారెడ్డి తన సొంత ఖర్చులతో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టై, బె ల్టులు పంపిణీ చేస్తున్నారన్నారు.
అందులో భాగంగా మనిగిల్లలో కూడా అందజేసినట్లు తెలిపారు. విద్యార్థు లు కష్టపడి చదివి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. గ్రామాల్లో మిగి లి ఉన్న పనులను దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. బలిజపల్లికి తన నిధుల నుంచి మహిళా సంఘం భవనాన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పం చాయతీకి ప్రహరీ నిర్మిస్తామని సర్పంచ్ జయంతికి తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు వి ష్ణువర్ధన్రెడ్డి, సర్పంచులు సిద్ధయ్య, జయంతి, రాధాకృష్ణనాయక్, వరలక్ష్మి, సరిత, అనంతమ్మ, ఎంపీటీసీ లు గిరమ్మ, భార్గవి, కురుమయ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, సత్యారెడ్డి, వెంకటస్వామి, వేణు, శ్రీనివాస్రెడ్డి, జానకీరాములు, అశోక్రెడ్డి, గట్టుయాదవ్ పాల్గొన్నారు.
కోటి టన్నుల నిల్వ గోదాంలు అవసరం
పెబ్బేరు రూరల్, ఫిబ్రవరి 23 : దేశానికి ధాన్యబాంఢాగారంగా మారిన రాష్ట్రంలో కోటి టన్నుల నిల్వ సా మర్థ్యం ఉన్న గోదాంలు నిర్మిస్తున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని సూగూరులో రూ. 9.50 కోట్లతో నిర్మించిన పది లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాంను బుధవారం మంత్రి ప్రారంభించారు. గుమ్మడం తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మెట్రిక్ టన్ను ల సామర్థ్యం ఉన్న గోదాంలు ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, గిడ్డంగుల శాఖ ఎండీ జితేందర్రె డ్డి, ఎస్ఈ రాధాకృష్ణ, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, ఎంపీపీ శైలజ, మార్కెట్ కమి టీ చైర్మన్ శ్యామల, నాయకులు రాంరెడ్డి, జగన్నాథం, కర్రెస్వామి, రాములు, సర్పంచ్ వెంకటస్వామి ఉన్నారు.
సీసీ రోడ్లకు శంకుస్థాపన..
శ్రీరంగాపూర్, ఫిబ్రవరి 23 : మండలంలోని రాజు ల గట్టు ఆర్అండ్ఆర్ సెంటర్లో రూ.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి నిరంజన్రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయిత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, నాయకులు గౌడ్ నాయక్, జగన్నాథం నాయుడు, సర్పంచ్ వినీలారాణి పాల్గొన్నారు.