వివరాలు వెల్లడించిన జోగుళాంబ గద్వాల ఎస్పీ
గద్వాల అర్బన్, జూలై 21 : వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురు బాలలను పట్టుకున్నట్లు ఎస్పీ జె.రంజన్ రతన్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. గద్వాల, ధరూర్, అయిజ, శాంతినగర్ ప్రాంతాల్లో నిలిపి ఉన్న బైక్లను దొంగిలించిన కేసుల్లో, గద్వాల పట్టణంలోని ఒక ఆలయంలో, ఒక ఇంట్లో చోరీలు జరిగాయి.
ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు జువైనల్ బాలలను గద్వాల పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి జిల్లా కేంద్రంలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు బైకులు, 25 తులాల వెండి, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన గద్వాల రూరల్ ఎస్సై ఆనంద్, సిబ్బంది సవారన్న, రంజిత్, ప్రసాద్, రాజు, నిజాముద్దీన్లను ఎస్పీ అభినందించారు.