గద్వాల, ఆగస్టు 17 : మీ ప్రభుత్వానికి మీ రే అండగా ఉండాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 76 మందికి బీసీ బంధు, 139 మందికి కల్యాణలక్ష్మి, షా దీముబారక్ చెక్కులను గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కులవృత్తులకు పూర్వవైభ వం తీసుకొచ్చేలా బీఆర్ఎస్ సర్కారు కృషి చే స్తున్నదన్నారు. బడుగు, బలహీన వర్గాల అ భ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక రకాల ప థకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. గద్వాల పట్టణంలో గ తానికి, ఇప్పటికీ జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ లు 76 ఏండ్లల్లో చేయలేని పనులను బీఆర్ఎస్ సర్కారు కేవలం తొమ్మిదేండ్లలో అంతకంటే ఎక్కువగానే చేసిందన్నా రు. గద్వాలలో మెడికల్, న ర్సింగ్ కళాశాల, 300 పడకల దవాఖాన, ఆర్టీసీ బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్ నిర్మాణం తదితర వాటిని మంజూరు చేయించానన్నారు. కులం, మతం పేరిట ఓ ట్లు దండుకునేందుకు గ్రామాల్లోకి వస్తుంటారని, అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వలసవాదులు కూడా గద్వాలకు వస్తున్నారని, వారికి మన కష్టాలు ఏం తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారిణి శ్వేతాప్రియదర్శిని, రైతు సంఘం అధ్యక్షుడు చెన్న య్య, వెంకట్రాములు, కౌన్సిలర్లు ఉన్నారు.