గద్వాల/జడ్చర్లటౌన్, మే 24 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోవాలాల బతుకులపై గ ట్టి దెబ్బ కొట్టింది. కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దినదిన గండం నూరేండ్ల ఆయుష్షు అనే మాదిరి అయ్యింది వారి పరిస్థితి. ప్రస్తు తం గిరాకీలు లేక అడ్డాల వద్ద ఆటోలను నిలుపుకొని ప్రయాణికుల కోసం ఎదు రుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. గతంలో ఒక్కో ఆటో డ్రైవర్ డీజిల్ ఖర్చు లు పోనూ ప్రతిరోజూ రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదించేవారు. దీంతో కుటుంబాలను పోషించుకోవడంతోపాటు ఈఎంఐలు సక్రమంగా చెల్లించే వారు. అయితే ఆరు నెలలుగా ఎంకి సావు సుబ్బి పెండ్లికి అడ్డు వచ్చినట్లు కాంగ్రె స్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటో కార్మికుల కుటుంబాలను వీధిన పడేలా చేసింది.
మరో 20రోజులు అయితే పాఠశాలలతోపాటు కళాశాలలు ప్రారంభమవుతుండడంతో తమ పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలి, పుస్తకాలతోపాటు యూనిఫామ్స్ ఇప్పించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక్కో ఆటో డ్రైవర్ ప్రతిరోజూ మూడు, నాలుగు ట్రిప్లు ఆటోలను నడిపేవారు. ప్రస్తుతం రోజుకు ఒక ట్రిప్ కూడా ప్రయాణికులను చేరవేయడానికి అవకాశం లేకుండా పోయింది. కేవలం రైతులు, వ్యాపారుల కిరాణం, ఎరువుల సంచులు ఇతర వా టి కోసం మాత్రమే ఆటోలను వినియోగిస్తుండడంతో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. మహిళలంతా ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో వీరిపై తీవ్ర ప్రభావం పడింది. ఒకప్పుడు మంచిగా గడిపిన తాము ప్రస్తుతం ఆ వృత్తిని వదిలి ఇతర పనుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని డ్రైవర్లు వాపోతున్నారు. ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుంటే తప్పా తమ పరిస్థితి మెరుగు పడేలా లేదని ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
పదో తరగతి వర కు చదువుకున్నా.. ఐ దేండ్లుగా మహబూబ్నగర్-జడ్చర్ల రూట్లో ఆటో నడుపుతున్నాను. భా ర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో కోసం రూ.40 వేలు అప్పు తీసుకున్నాను. ప్రతి నెలా రూ.5వేలు కిస్తు కడుతున్నాను. ఫ్రీ బస్సు వచ్చినంక మహిళలు ఆటోలో ఎక్కడం లేదు. గతంలో రోజుకు రూ. 1200 మిగిలేవి. ఇప్పుడేమో రూ. 500 కూడా రావడం లేదు. ఖర్చులకే సరిపోవడం లేదు. కిస్తులు ఎలా క ట్టాలో అర్థం కావడం లేదు. పిల్లల ఫీజులు, బుక్కుల కోసం అప్పు చే యక తప్పదు. వాటిని ఎలా తీ ర్చాలో తెలియడం లేదు. కాంగ్రెస్ సర్కారు ఉచిత ప్రయాణంతో మా బతుకులను బజారున పడేసింది.
గతంలో గద్వాల నుంచి మా గ్రా మానికి మూడు ట్రిప్పులు ప్రయాణికులను తీసుకెళ్లేవాళ్లం. దీంతో ఖర్చు లు పోనూ రూ.800 వరకు వచ్చేవి. నెలనెలా ఈఎంఐలు కట్టేవాళ్లం. ఉచిత బస్సు ప్రయాణంతో సర్కారు మా కడుపు మీద కొట్టింది. ప్రస్తుతం ఒక్క ట్రిప్ కూడా వెళ్లడం లేదు. ఇరవై రోజులైతే పాఠశాలలు, కళాశాల లు తెరుస్తారు. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ తీసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కు తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. గతంలో రోజం తా నడిపితే డీజిల్, మెయింటనె న్స్ ఖర్చులు పోనూ రూ.500-600 మిగిలేవి. ఇప్పుడు రూ. 200 కూడా రావడం లేదు. కుటుంబ పోషణ, పిల్లల చదువు లు భారంగా మారాయి. ప్రభుత్వం తమ కష్టాలను గు ర్తించి నెలకు రూ.10 వేలు అందించి ఆదుకోవాలి.
నిత్యం గద్వాల నుంచి పూడూరుకు ఆటో నడుపుతున్నాను. గ తంలో ఆటోల్లో ప్రయాణికులు బాగానే ఎక్కేవారు. ప్రస్తుతం అందరూ బస్సుల్లో వెళ్తుండడంతో గిరాకీలు లేకుండాపోయాయి. రోజుకు లైన్లో ఒక ట్రిప్ దొరికితే గగనం. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. గిరాకీలు లేక ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. బ్యాంకు అప్పు తీర్చడానికి తమకు తిండి పెట్టే ఆటోను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ నిర్ణయం మంచిగా లేదు. ఆటోడ్రైవర్ల గురించి ఓసారి ఆలోచించాలి.
నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. ఎనిమిదేండ్లుగా మహబూబ్నగర్-జడ్చర్ల రూట్లో ఆటో నడిపిస్తున్నాను. నాకు భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. ఆటోపై రూ.లక్ష అప్పు ఉ న్నది. ప్రతినెలా రూ.6,800 కిస్తు కడుతున్నాను. ప్రతిరోజూ 5 ట్రిప్పులు కొడితే రూ.1500 వచ్చేవి. ఫ్రీ బస్సు అయినక గిరాకీ లేక రూ.500 కూడా రావడం లేదు. మహిళలెవరూ ఆటోలో ఎక్కడం లేదు. ఒకవేళ ఆటోలో ఎవరైనా ఎక్కినా బస్సు వచ్చిందంటే దిగి వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది బాబును స్కూల్లో చేర్పించాలి. ఫీజు రూ. 15వేలు అంటున్నారు. ఫీజుతోపాటు స్కూల్ డ్రెస్సు, బూట్లు, పుస్తకాల ఖర్చులు ఉంటాయి. కనీసం రూ.20వేల వరకు ఖర్చు అవుతుంది. బాబును చదివించుకోవాలంటే అప్పుచేయక తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మా జీవితాల్లో కష్టాలను తీసుకొచ్చింది.
ప్రతి రోజూ గద్వాల నుంచి అనంతపురం గ్రామానికి ప్రయాణికులను తీసుకెళ్తుంటాను. ఖర్చులు పోనూ రూ.వెయ్యి దాకా వచ్చేది. ప్రస్తుతం ఆటోను అడ్డమీద పెట్టుకొని ప్రయాణికుల కోసం ఎదురు చూడాల్సిన ప రిస్థితి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బదులు చార్జీలు తగ్గించి ఉంటే ఇటు ప్రభుత్వానికి మాకు ఆదాయం ఉండే ది. ప్రస్తుతం రోజుకు రూ.300 సంపాదించడం గగనంగా మారింది. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆ ర్థికంగా ఆదుకోవాలి.