అచ్చంపేట, జనవరి 1 : లక్కీ స్కీమ్ పేరుతో డబ్బులు వ సూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగిన ఘటన అచ్చంపేటలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా.. అచ్చంపేటకు చెందిన కొందరు శ్రీలక్ష్మీనర్సింహ స్వామి ఎంటర్ప్రైజెస్ పేరుతో లక్కీస్కీమ్ ఏర్పాటు చేశారు. ఏజెంట్ల ను నియమించారు. ఒక్కో సభ్యుడి నుంచి రూ.300 చొ ప్పున లక్ష మంది నుంచి కూపన్లు కొనుగోలు చేయించి నిర్వాహకులకు అందజేశారు. రూ.10 లక్షల నగదు, కారు, బైక్, ట్రాక్టర్, బంగారం తదితర బహుమతులు అందిస్తున్నట్లు కరపత్రాల్లో పేర్కొన్నారు. ఆరు నెలల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సభ్యులు ఈ స్కీమ్లో చేరి రశీదు పొం దారు. శనివారం అచ్చంపేటలోని షామ్స్ ఫంక్షన్హాల్లో డ్రా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏజెంట్లు, సభ్యులు అధికంగా తరలివచ్చారు. అయితే డ్రా తీసిన నెంబర్లలో అక్కడికి వ చ్చిన వారిలో ఎవరి పేర్లు లేకపోవడంతో అనుమానంతో ని ర్వాహకులను నిలదీశారు. డ్రా సమయంలో వేసిన రశీదులు పరిశీలిస్తే వినియోగదారులకు ఇచ్చినవి కాకుండా నిర్వాహకులు సొంతంగా తయారు చేసిన నకిలీ రశీదులుగా సభ్యులు గుర్తించారు. సభ్యుడి పేరు, ఫోన్ నెంబర్, చిరునామా లేకుండా ఇష్టానుసారంగా రాసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న డబ్బా లు, టేబుళ్లు పడేయడంతో నిర్వాహకులు అక్కడి నుంచి జా రుకున్నారు. తర్వాత బాధితులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. పోలీస్ష్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు. లక్కీ స్కీమ్ పేరుతో మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆరీఫ్, మనోహర్, లింగమయ్య, లాల్గౌడ్, వెం కటయ్యతోపాటు కల్వకుర్తి, వెల్దండ, అమ్రాబాద్, అచ్చంపే ట ప్రాంతాల బాధితులు డిమాండ్ చేశారు. లక్ష మంది నుం చి దాదాపు రూ.3 కోట్ల వరకు వసూలు చేసి ఉంటారని ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి స్కీమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలన్నారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై ప్రదీప్ తెలిపారు.