బిజినేపల్లి, ఏప్రిల్ 10 : తుఫాను డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పది మందికి గాయాలైన ఘట న బిజినేపల్లిలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. ఉగాది పర్వదినాన్ని పురసరించుకొ ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన 13మంది శివ భక్తులు తుఫానులో శ్రీశైలం నుంచి బిజినేపల్లి మీదుగా కర్ణాటకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తుఫాన్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీజాపూర్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన వందన (55) అకడికకడే మృతి చెందగా, భారతి (44) నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదేవిధంగా దేవేందర్, మహాదే వి, దానమ్మ, నాగవ్వ, ధన్పాల్, సావిత్రి, అనిత, మల్లమ్మ, మల్లప్పకు గాయాలయ్యా యి. వీరిలో ఏడుగురిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నాగశేఖర్రెడ్డి వెల్లడించారు.
వనపర్తి టౌన్, ఏప్రిల్ 10 : బైకు, కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకున్నది. వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్కు చెందిన వెంకటేశ్, జడ్చర్లకు చెందిన రవికుమార్ వనపర్తి నుంచి మోటర్ సైకిల్పై కొత్తకోటకు వెళ్తున్నారు. కొత్తకోట నుంచి వనపర్తికి వస్తున్న కారుకు ఎదురుగా కుక్క రావడంతో సడన్ బ్రేక్ వేయగా అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో రెండు వాహనాలు రోడ్డుకిందకు దూసుకెళ్లాయి. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న వెంకటేశ్, రవికుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను జిల్లా ప్రభు త్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఘటనాస్థలిని సీఐ నాగభూషణ్రావు పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.