నాగర్కర్నూల్, ఫిబ్రవరి 5 : నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని, అందుకు మున్సిపాలిటీ పరిధిలోని కారు గుర్తుపై బరిలో ఉన్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. గురువారం నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 20 వార్డుల్లో మర్రి ఇంటింటి ప్రచారం చేశా రు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో అభివృద్ధి జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసునని, ఇ ప్పటికే అవే అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయన్నారు.
రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన వాటికి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశా రు. ఆరు గ్యారెంటీలు, 420 మోసపూరిత హా మీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో బొందపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అ భ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.