వంగూరు, మార్చి 3 : ఎన్నికలకు ముందు అనే క హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక ల ముందు కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణల తో పాటు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అదే ఆ రోపణలు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి కాలం గడుపుతున్నారని ఎద్దే వా చేశారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారని, అ దేవిధంగా ఆరు గ్యారెంటీలను కూడా అమలు చే యడంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం వేసిన 25 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. రాష్ట్రంలో ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించకుండా రైతులు, ప్ర జలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. రూ.30 వేల కోట్లతో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ వంటి బృ హత్తర ప థకంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులతోపాటు గ్రామాల్లో పనిచేస్తున్న వీవోఏలు, ఆశ కార్యకర్తలను తొలగించి తమ పార్టీ కార్యకర్తలను నియమించుకోవాలనే నీచ సంస్కృతికి కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపిందన్నారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ చిరుద్యోగులను తొలగించే ప్రయత్నం చేయలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్ కుటుంబంపై ని త్యం ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో కక్ష సాధింపులు తీవ్రమయ్యాయని, వాటికి స్వ స్తి పలుకకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గణేశ్రావు, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, నాయకులు పుల్లయ్యయాదవ్, ఎల్లాగౌడ్, బాలస్వామిగౌడ్, నాగేశ్, రవియాదవ్ ఉన్నారు.