అచ్చంపేట, మే 1 : కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని 8,18వ వార్డుల్లో బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. విద్యావంతుడైన ఆర్ఎస్పీని గెలిపిస్తే పేదల గొంతుక ఢిల్లీ గడ్డపై గర్జిస్తుందన్నారు. కాంగ్రెస్ కరువును వెంట తెచ్చిందన్నారు.
పంటలు ఎండిపోయినా, పట్టించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. అక్రమ ఇసుక, అక్రమ మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పి ఆర్ఎస్పీని ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు అప్పశివ, రమేశ్రావు, శివ, బాలరాజు, నాయకులు శంకర్, నాగరాజు, వెంకటస్వామి, పెంటయ్య, హరీశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.