అచ్చంపేటరూరల్, మే 2: బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు అన్నారు. గురువారం ఆయన ఉప్పునుంతల మండలం లత్తీపూర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ శివారులో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు.
నడింపల్లిలో విద్యాభ్యాసం చేసిన ప్రవీణ్కుమార్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని ఆయనను ఆదరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి ఆర్ఎస్ప్రవీణ్కుమార్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు అజయ్కుమార్ , రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట టౌన్, మే 2 : సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని 11వ వార్డులో ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని.. ఓటు వేసేముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, కౌన్సిలర్ రమేశ్రావు, బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెల్దండ, మే 2 : బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ప్రవీణ్కుమార్ను మెజార్టీతో గెలిపించుకుందామని బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు యాదగిరి, మండల నాయకుడు రాజు అన్నారు. గురువారం ఆర్ఎస్ ప్రవీణ్కుమమార్కు మద్దతుగా వెల్దండలో జోరుగా ప్రచారం చేశారు. ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. తిమ్మినోనిపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు రాజు ఇంటింటి ప్రచారం చేశారు. పేదల బాగోగులు తెలిసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపిస్తే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకుడు మహేశ్యాదవ్ పాల్గొన్నారు.