భూత్పూర్, ఫిబ్రవరి 28 : నూతన గృహప్రవేశం చేసిన సందర్భంగా జర్నలిస్టు కుటుంబం భావోద్వేగానికి గురైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. భూత్పూరు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాయపల్లి సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అక్కడ ఓ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు కృష్ణమోహన్కు డబుల్ బెడ్రూం ఇల్లును నాటి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గత నవంబర్లో మంజూరు చేశారు. అయితే చిన్న చిన్న పనులు పూర్తయ్యాక బుధవారం కృష్ణమోహన్ గృహప్రవేశం చేశారు.
ఈ వేడుకకు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆలను అతడు ఆహ్వానించారు. ఇంట్లోకి వచ్చిన ఆలను చూసిన ఆ కుటుంబం ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. కుటుంబ సభ్యులు కండ్ల నిండా నీళ్లు తెచ్చుకున్నారు. కేసీఆర్ సర్కారు హయాంలో ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్రెడ్డి ఉన్నందుకే మాకు ఇల్లు మంజూరైందని వారు ఆనంద భాష్పాలు కారుస్తూ చెప్పుకొచ్చారు.