భూత్పూర్, జనవరి 14 : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆల శశివర్ధన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆల కుటుంబ సభ్యులు తల్లి వరలక్ష్మి, భార్య శ్రీలతను పరామర్శించారు.
అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, గువ్వల బాలరాజుతో కలిసి అన్నాసాగర్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్ రాకను తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నాసాగర్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేటీఆర్ వెంట మాజీ చైర్మన్లు వాల్యానాయక్, ఇంతియాజ్ ఇసాక్, రజిని, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీలు కదిరె శేఖర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, గుంత మౌనిక, రమాశ్రీకాంత్, జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, కాటం ప్రదీప్గౌడ్, చంద్రశేఖర్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.