మహబూబ్నగర్ అర్బన్, మే 28 : సురవరం ప్రతాపరెడ్డి మహోన్నతుడని, తాను ఏనాడూ ఆయన కుటుంబం కోసం పనిచేయలేదని.. సమా జం బాగు పడాలన్న ఉద్దేశంతో అడుగులు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం సురవరం జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతీ కాలనీలోని గ్రీన్బెల్ట్లో ఉన్న విగ్రహానికి ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు సురవరం కపిల్, నివేదితతోపాటు పలువురితో కలిసి శ్రీనివాస్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడిగా సువరం గుర్తింపు పొం దాడని గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్రను నేటి సమాజానికి తెలియజేయాలన్నారు. సమాజం బాగే తనకు ముఖ్యమని, తన ఆస్తులు కాదని త్యా గం చేసిన గొ ప్ప మేధావి అని కొనియాడారు. తె లంగాణ సాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్లు గణేశ్, అనంతరెడ్డి, ప్రవీణ్, లక్ష్మణ్, గిరిధర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గోపాల్ యా దవ్, నవకాంత్, కరుణాకర్గౌడ్, సతీశ్ పాల్గొన్నారు.