హన్వాడ, మే 29 : మండలకేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద ఉపాధి కూలీలు బుధవారం ఎండలో బా రులుదీరారు. ఇది చూసిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారి వద్దకు వెళ్లి ఎందుకు ఇక్కడ నిలబడ్డారని ప్రశ్నించారు. స్పందించిన ఉపాధి కూలీలు.. ‘సార్ మేము ఉపాధి పనులు చేసి ఐదు వారాలవుతున్నా కూలి డబ్బులు ఇయ్యలేదు. మండలకేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద ఉపాధి కూలీలు బుధవారం ఎండలో బా రులుదీరారు. ఇది చూసిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారి వద్దకు వెళ్లి ఎందుకు ఇక్కడ నిలబడ్డారని ప్రశ్నించారు. స్పందించిన ఉపాధి కూలీలు.. ‘సార్ మేము ఉపాధి పనులు చేసి ఐదు వారాలవుతున్నా కూలి డబ్బులు ఇయ్యలేదు. ఎన్నిసార్లు అధికారులను అడిగినా వస్తాయని చెబుతున్నారే తప్పా.. ఇవ్వడం లేదు.. మీరు ఉన్నప్పుడు పింఛన్ వచ్చిందంటే చాలు ఆఫీసు ముందర టెంటు వేసెటోళ్లు. ఇ ప్పుడేమో ఎండల నిలబడి పింఛన్, కూలి డబ్బులు తీసుకుంటున్నాం’. అని సమాధానమిచ్చారు. స్పం దించిన మాజీ మంత్రి కూలి డబ్బులు ఎందుకు రా వడం లేదో తాను కనుక్కుంటానని కూలీలకు హామీ ఇచ్చారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే.. ఇ ప్పుడు చాలా తిప్పలైతుందని కూలీలు అనడంతో.. శ్రీనివాస్గౌడ్ వెంటనే ఆఫీసు ముందు టెంటు వే యించారు.
దీంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశా రు. అంతకుముందు మండలకేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మహ్మద్ అనారోగ్యంతో మృతి చెందగా శ్రీనివాస్గౌడ్ నివాళులర్పించి బాధిత కు టుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్య పడొద్దన్నా రు. మహ్మద్కు పార్టీ నుంచి ఎలాంటి సహాయం వచ్చినా వెంటనే అందజేస్తామన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చి నా కాపాడుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానన్నారు. మాజీ మంత్రి వెంట ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, నాయకులు అన్వర్, కొండా లక్ష్మయ్య, జంబులయ్య, మాధవులుగౌడ్, వెంకటేశ్, రాములు, బసిరెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.