జడ్చర్ల టౌన్/ఆత్మకూరు/ధన్వాడ/మదనాపురం, ఏప్రిల్ 22 : ప్రజలను మోసం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే.. బీజేపీ పార్టీ దోఖా చేసిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో ఈ రెండు పార్టీలు ఒకదానికి మించి మరొకటి ఉంటాయన్నారు. అబద్ధపు హామీలను నమ్మి కాం గ్రెస్ను గెలిపించిన ప్రజలు మోసపోయారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం బీఆర్ఎస్ పా లమూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జ డ్చర్లలోని చంద్రాగార్డెన్లో, పేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ధన్వాడ కన్వెన్షన్ హా ల్లో, మదనాపురం మండలం దంతనూరు శివారు ఏ వన్ ఫంక్షన్ హాల్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో, ఆత్మకూరులోని సాయితిరుమల కల్యాణ మండపంలో బీఆర్ఎస్ శ్రేణుల వి స్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
సమావేశాలకు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, పాలమూరు, పేట, జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెం ట్ ఎన్నికల పరీశీలకుడు పల్లె రవికుమార్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అధికారం కోసం నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పు డు వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఇబ్బందులు పడుతున్నా సర్కారు పట్టించుకోవడంలేదని, ఆ పార్టీని ఓడించేందుకు రైతులు కసిగా ఉన్నారన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ మనసున్న మారాజని కొనియాడారు.
మళ్లీ బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేదని, అనేక కంపెనీలొచ్చి జిల్లావాసులకు ఉపాధి లభించేదన్నారు. బీజే పీ రాముని పేరుతో రాజకీయం చేస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్లోనూ రాముడు (కేటీఆర్), లక్ష్మణు డు (జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి) ఉన్నారన్నారు. కాంగ్రెసోళ్లు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై గడపగడపకూ వెళ్లి ఆరా తీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సర్కారు హామీలు అందని వారంతా బీఆర్ఎస్కు ఓటు వేసేలా చూడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొ రపాట్లను సరిదిద్దుకునే అవకాశం వచ్చిందని, మరొసారి మన్నె శ్రీనివాస్రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మహబూబ్నగర్ జెడ్పీవైస్ చైర్మన్ యాద య్య, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయ క్, నారాయణపేట జెడ్పీ కోఆప్షన్ సభ్యులు వాహిద్, జడ్చర్ల, ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ చైర్పర్స న్లు లక్ష్మి, గాయత్రీయాదవ్, మంగమ్మగౌడ్, ఆత్మకూరు ఎంపీపీ శ్రీనివాసులు, జెడ్పీటీసీ శివరంజని, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రఘుపతిరెడ్డి, రవికుమార్యాదవ్, ఎం.వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, మున్సిపల్ వైస్చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, జడ్చర్ల సింగిల్విండో అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్లు గోవర్ధన్రెడ్డి, లక్ష్మయ్య, మురళి, కౌన్సిలర్లు, మా జీ ఎంపీపీ శ్రీధర్గౌడ్, అమరచింత మార్కెట్యార్డ్ చైర్మన్ ఎస్.ఎ.రాజు, మాజీ చైర్మన్ నాగభూషణంగౌ డ్, అమరచింత పార్టీ ప్రెసిడెంట్ రమేశ్, నాయకులు రాజవర్ధన్ రెడ్డి, సంపత్కుమార్, సలీం, చంద్రశేఖర్, శ్రీనివాస్గౌడ్, సునీల్రెడ్డి, సచిన్, మల్లేశ్, శశికళ, ఇ ర్ఫాన్, శ్రీనివాసరెడ్డి, రవి, బాలరాజు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
‘కాంగ్రెస్ మోసపూరిత పార్టీ. ప్రజలను నమ్మించి మోసం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.4 వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500, ఇలా ఆరు గ్యారెంటీలం టూ ప్రజలను మోసం చేసింది. కేవలం బస్సు మాత్రమే మ హిళలకు ఫ్రీగా నడిపిస్తున్నారు. ఇదొక్కటి ఇస్తే సరిపోతదా.. ఫ్రీ కరెంట్ ఇవ్వడం లేదు. చెప్పిన పనులు చేయడం లేదు.. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మల్లెట్లా ఓట్లేయాలి. ఆ పార్టీ నిజస్వరూపం బయటపడింది. ప్రజలను మోసం చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు’. అని నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్తో సదరు మహిళ మాట్లాడుతూ కాంగ్రెస్ పనితీరును ఎండగట్టింది.
– వడ్డె మంగమ్మ, కాంగ్రెస్ మహిళా కార్యకర్త, దినసరి కూలి, ధన్వాడ
ఎన్నికలప్పుడు మాత్రమే గ్రామాల్లోకి వచ్చే కాం గ్రెస్, బీజేపీ నాయకులను ఓడించాలని కార్యకర్తలకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో సంక్షేమం అందని ఇల్లు లేదన్నారు. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ అందించిన పథకాలను వివరించాలని సూచించారు. ఎన్నికలప్పుడు డీకే అరుణ, వంశీచంద్రెడ్డిలు ఓట్లు అడగడానికి వస్తే ఈ ప్రాంతానికి ఏం చేశారో అడగాలన్నారు. రైతులను మోసం చేసి న కాంగ్రెస్ పార్టీకి వారే గుణపాఠం చెబుతారన్నా రు. మతం పేరుతో ఓట్లు అడిగే బీజేపీని బొందపెట్టాలన్నారు. అరుణ మంత్రిగా ఉండి ధన్వాడకు చేసిందేమీలేదన్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచమే గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టును ని ర్మిస్తే కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తున్నదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. మరమ్మతులు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు ఉత్తర్వులిచ్చి తామే ఉద్యోగాలిచ్చామని చెప్పడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని అభ్యర్థించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకొచ్చి ఇప్పుడేమో దాటవేత ధోరణితో రైతులను గోస పెడుతున్నదన్నారు. కేసీఆర్ పాలనలో మండు వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకోగా కాంగ్రెస్ పాలనలో చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయన్నారు.
పార్లమెంట్ ఎన్నిక ల్లో సమిష్టిగా కష్టప డి పనిచేసి బీఆర్ఎ స్ సత్తాచాటుదామ ని బీఆర్ఎస్ పాలమూరు జిల్లా అధ్యక్షు డు లక్ష్మారెడ్డి అన్నా రు. కాంగ్రెస్ మాయమాటలు, అబద్ధపు హామీలకు మోసపోయి ప్రజలు ఓట్లు వేశారన్నారు. మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని విమర్శించారు. ప్రజలు, రైతుల కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచుతున్నదన్నారు. అబద్ధాలు ఎలా మాట్లాడాలో సీఎం రేవంత్రెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు.
పంట బోనస్, రుణమాఫీ, పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ రైతులతో పోస్టుకార్డులు రాయించి ప్ర భుత్వానికి పంపించాలని కార్యకర్తలకు సూచించారు. హస్తం, కమలం మోసాలను ప్రజలు గుర్తిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తాయని ఇటీవల చేసిన సర్వేలో తేలిందన్నారు. రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అనే నినాదంతో సోషల్మీడియాలో ప్రచారం మొదలైందన్నారు. ఈనెల 26న మహబూబ్నగర్కు కేసీఆర్ రానున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ నేతలు అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వే యించడం వల్లే ఓడిపోయానని నారాయణపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేందర్రె డ్డి అన్నారు. ఈ విష యం తెలిసే పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రతంగ్పాండురెడ్డి పార్టీకి రాజీనామా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కార్యకర్తలు సక్రమంగా పనిచేయకపోవడం, బీజేపీ ఓట్లు కాంగ్రెస్కు పడడంతోనే ఓటమిని చవిచూశామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో రెండులక్షల ఎకరాలకు సాగునీరు అం దించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పేరుతో ధన్వాడకు సాగునీరు రాకుండా చేస్తున్నారన్నారు.
కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల నుంచి ధన్వాడ మండలంలో ఒక్క ఎకరాకు సాగునీరిచ్చినా రాజకీయాల నుంచి త ప్పుకుంటానని సవాల్ విసిరారు. ధన్వాడ చెరువు పూడికతీతతో ఒండ్రుమట్టిని ఇక్కడి ఆడబిడ్డ మక్తల్ కాంట్రాక్టర్లకు అమ్ముకోవడం తప్పా.. అభివృద్ధి శూన్యమన్నారు. తెలంగాణ అస్థిత్వాని సంరక్షించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, పేదల నడ్డి విరుస్తూ కార్పొరేట్ కంపెనీలకు వ త్తాసు పలికిందని ధ్వజమెత్తారు. పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల కూడా మం జూరు చేయలేదని, కేసీఆర్ జిల్లాకో కళాశాల ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్, క ర్ణాటక రాష్ర్టాల్లోని ప్రాజెక్టులకు జాతీయహోదా ప్రకటించి న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకివ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ ఎం పీలు తెలంగాణ అభివృద్ధిపై పార్లమెంట్ లో ఒక్కరూ మాట్లాడలేదు. బీఆర్ఎస్ హయాంలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పం డించేస్థాయికి తెలంగాణ ఎదిగింది. మోదీ ఇంటింటికీ అక్షింతలు మాత్రమే పంపాడు.. కానీ దేశానికే అన్నం పెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది.
తెలంగాణ ధా న్యం కొనబోమని చెప్పిన బీజేపీ ఇప్పుడొచ్చి ఓట్లెలా అడుగుతుంది. హిందూ ముస్లింల పేరుతో బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. బీజేపీకి వ్యతిరేకం గా పనిచేస్తున్న వారిపై ఈడీ కేసులతో భయపెడుతున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ కు, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీకి ఓట్లడిగే నైతిక హక్కులేదు. ఎంపీ ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ గుడ్బై చెబుతుంది. వారి మోసం ప్రజలకు అర్థమైంది. భవిష్యత్లో బీఆర్ఎస్ ప్రభుత్వ మే వస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడుతా. మరోసారి ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి.
– మన్నె శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ