గోపాల్పేట/పెద్దమందడి, ఏప్రిల్ 22 : నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అత్యంత ప్ర తిభావంతుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంట్కు పంపుదామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాగర్కర్నూల్ చరిత్రలో ఇంతటి విజ్ఞానవంతుడు ఎన్నికల్లో పోటీ చేయలేదని మంత్రి వెల్లడించారు. సోమవారం రేవల్లి, గోపాల్పేట, పెద్దమందడి మండలాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పీతో క లిసి మాజీ మంత్రి ఇంటింటా ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాన్ని వదులుకుని పేదల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు.
నిజాయితీపరులు, నికార్సై న వ్యక్తులకు ఓటర్లు అండగా నిలవాలని కోరారు. నాగర్కర్నూల్ పార్లమెంట్కు ఇంత నిబద్ధత కలిగిన వ్యక్తి పోటీ చేయడాన్ని తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి ఫలితాన్ని స్వయంగా చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికలు పదేండ్ల అభివృద్ధి, నాలుగు నెలల నయవంచనకు మధ్య జరుగుతున్నవని, ప్రవీణ్కుమార్కు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ప్రభు త్వం ఉంటుందో? ఊడుతుందోనని ఆ పార్టీ నాయకులే అంటున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నెలకే 2లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్కరికైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
పార్లమెంట్లో తెలంగాణ వాణిని, విద్యార్థుల సమస్యలపై ఆర్ఎస్పీ ప్రస్తావిస్తాడన్నారు. అనంతరం పెద్దమందడికి చెందిన 30మంది బీఎస్పీ నాయకులు నిరంజన్రెడ్డి, ఆర్ఎస్పీ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బైకాని శ్రీనివాస్యాదవ్, అభిలాష్రావు, గోపాల్పేట ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, వైస్ఎంపీపీ మధుసూదన్రెడ్డి, విజయమోహన్, పెద్దమందడి జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వేణుయాదవ్, నాయకులు దయాకర్, రాజాప్రకాశ్రెడ్డి, కుమార్యాదవ్, తిరుపతయ్య యాదవ్, చంద్రశేఖర్, మతీన్, శివరాంరెడ్డి, దొడ్ల రాములు, కాల కు రుమయ్య, లక్ష్మణ్, పరమేశ్, నాయకులు, కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.