పెద్దమందడి, మార్చి 6 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలోని రైతుబం ధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీలకు గెలుపోటము లు సహజమని, చాలా స్వల్ప ఓట్లతో అధికారం కోల్పోవడం జరిగిందన్నారు. అందు కు నిరుత్సాహపడకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిద్దామన్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే పార్లమెంట్లో తెలంగాణ గురించి కొట్లాడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది త్వరలోనే బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. అభ్యర్థులు ఎవరైనా వారి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీని వదిలి వెళ్లిన వారి గురించి ఎవ రూ ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇప్పుడు పార్టీ కో సం కష్టపడిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కాంగ్రెసోళ్లు బీజేపీ వారిపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా కేసీఆర్ను తిట్టి ఓట్లు అడుగుతున్నారని, బీజేపీ వారు కాంగ్రెసో ళ్లను కాకుండా కేసీఆర్ను తిట్టి ఓట్లు అడుగుతున్నారని, ఆ రెం డు పార్టీల వారికి కేసీఆరే సరైనోడని అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి వంద జాకీలు పెట్టినా లేచే పరిస్థితిలో లేడన్నారు. ప్రస్తుతం 548 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్కు కేవలం 55మాత్రమే ఉన్నాయన్నారు. గత పదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని పచ్చబరిస్తే కాంగ్రెస్ కాలు మోపినప్పటినుంచి తిరిగి కరువుతో రాష్ట్రం అల్లాడుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు ఉందని, ఆ పార్టీ ముఖ్యమంత్రి, మం త్రులు ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థమవ్వ డం లేదన్నారు. ఎటుచూసినా సాగుచేసిన పంటలు ఎండుమొ హం పట్టి ఎండుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు చలనం లేకుండా ఉన్నారన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తరతమ అనే భేదం లేకుండా పనులు చేశామని, ఎవరు వచ్చి నా పార్టీలకతీతంగా పనులు చేసిపెట్టామన్నారు. మన కార్యకర్తలంతా అధైర్యపడకుండా నిక్కచ్ఛిగా పనిచేయాలని అధికారులు ఏమై నా పనులు చేయకపోతే పోట్లాడి చేయించుకోవాలని మీవెంటే ఉంటానని భరోసానిచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు మన్యపురెడ్డి, దయాకర్, సింగిల్విండో చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, వైస్చైర్మన్ కుమార్యాదవ్, నాగేంద్రంయాదవ్, శశివర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణుయాదవ్తోపాటు ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచు లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.