నవాబ్పేట, జనవరి 27 : పండ్లు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ శివరాంప్రసాద్ సూచించారు. మండలంలోని కొల్లూరు రైతువేదికలో శుక్రవారం కూరగాయలు, పండ్ల పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూస పద్ధతిలో పంటలు సాగు చేస్తున్న రైతులు.. పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలా కాకుండా తక్కవ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అందించే నూతన వ్యవసా య పద్ధతులు అవలంబించాలని కోరారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సా గు చేయాలని కోరారు.
ప్రస్తుతం మార్కెట్ లో వివిధ రకాల పండ్లు, కూరగాయలకు మంచి డిమాండ్ ఉన్నదని తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకంతో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. పం డ్లు, కూగాయలు సాగుచేసే రైతులకు ఎంఎస్ఎంఈ సంస్థ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అలాగే ప్రభు త్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సంస్థ ప్రతినిధులు రాజ్కుమార్, శర్మ, బీకేఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆదిరెడ్డి రాజిరెడ్డి, సంజయ్, ఆర్డీఎస్ వ్యవస్థాపక సభ్యులు చిన్నమ్మ థామస్, రుద్రూరు కళాశాల ప్రొఫెసర్ రోహిత్, నవాబ్పేట ఏఎంసీ వైస్చైర్మన్ చందర్నాయక్, కొల్లూరు సర్పంచ్ సౌజన్యారఘు, ఏఈవో శశిత, ఎంఎస్ఎంఈ క్లస్టర్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, సభ్యులు రామ్మోహన్రెడ్డి, గజేందర్, మల్లయ్య, అంజ య్య తదితరులు పాల్గొన్నారు.