మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 6: రా ష్ట్ర ప్రభుత్వం పోలీస్శాఖలో భర్తీ చేయనున్న వివి ధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో మాట్లాడారు. పరీక్షలు పూర్తిగా ఆ ధునిక పరిజ్ఞానం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష న్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహబూబ్నగర్ స్డేడియంలో ఈనెల 8 నుంచి జనవరి 3వ తేదీవరకు జరిగే పరీక్షల్లో 23,747మంది ఆ భ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఇందులో 19,504మంది పురుషులు, 4,243మంది మహి ళా ఆభ్యర్థులు పాల్గొంటారని, ప్రతిరోజూ ఉద యం 5గంటల నుంచి గ్రౌండ్లోకి అనుమతించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ప్రతిభపై నమ్మ కం ఉంచుకొని పరీక్షలో పాల్గొనాలన్నారు. పైరవీకారులు, మోసగాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. ఎం పిక విధానం నిష్పక్షపాతంగా ఆధునిక టెక్నాలజీ ఆన్లైన్ విధానంతో జరుగుతుందన్నారు. అనంత రం దేహదారుఢ్య పరీక్షలకు స్డేడియంలో ఏర్పాట్ల ను పరిశీలించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు, ఏవో కృష్ణయ్య ఉన్నారు.