తిమ్మాజిపేట, ఏప్రిల్ 3 : పొట్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన బుధవారం ఉదయం మండలంలోని గుమ్మకొండ సమీపంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం గుమ్మకొండ శి వారులో గురు గణేశ్ బయో ఫియల్ ఇండస్ట్రీ (పొట్టు కంపెనీ)లో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వివిధ రకాల పొట్టు ఉండడం తో నిమిషాల్లోనే మంటలు పెద్దగా మారడంతో పొట్టు మొత్తం అంటుకుపోయింది. మంటలను ఆర్పేందుకు నాగర్కర్నూల్, జడ్చర్ల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలు రాగా దాదాపు నాలుగు గంటలపాటు శ్ర మించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా సా యంత్రం మంటలు అదుపులోకి వచ్చాయి.
విషయం తెలుసుకున్న ఎస్సై నరేందర్రెడ్డి ఘటనా స్థలానికి చే రుకొని విచారణ నిర్వహించారు. అయితే ఆస్తినష్టంపై పూర్తి అంచనాలకు రాలేకపోతున్నామని, ప్రమాదంలో దాదాపు 50 లారీలకు పై గా పొట్టు కాలిపోయి సుమారు రూ.20లక్షలకు పైగా నష్టం జరిగి ఉండొచ్చని చెప్పారు. స్థానికులు మాత్రం ఇంకా పెద్ద మొత్తంలోనే నష్టం జరిగిందని చెబుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలు తెలియరాలేదని ఎస్సై వెల్లడించారు.