బల్మూరు, మే 5 : తాగునీటి కోసం గొడవప డి బోరు మోటరు, స్టార్టర్, పైపులైన్ను పగులగొట్టిన ఘటన ఆదివారం మండలంలోని పొలిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రా మంలో కొద్దిరోజుల నుంచి తాగునీటి సమ స్య ఉన్నది, ఈ సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఆదివారం ఉద యం గ్రామంలో ఎస్సీ కాలనీ, పోచమ్మ ఆ లయం దగ్గర ఉన్న బోరుమోటర్ దగర నీళ్ల కోసం పెద్ద ఎత్తున గొ డవ పడి పైపులు పగులగొట్టారు. తాగునీటి సమస్య తీవ్రం గా ఉన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అ ధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.