నవాబ్పేట, జనవరి 9 : మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ బ్రహోత్సవాల్లో ముఖ్యఘట్టమైన శకటోత్సవం, బోనాల ఉత్సవాలను భక్తులు మంగళవా రం భక్తిభ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా చేపట్టారు. సాయంత్రం ఆలయ ఆవరణలో శకటోత్సవం కనుల పండువగా సాగింది. ఎడ్ల బండ్లు, వాహనాలను ఆలయం చుట్టూ ఊరేగించారు. మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు.
ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో చైర్మన్ కృష్ణయ్య, ఈవో మదనేశ్వర్రెడ్డి, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, సర్పంచ్ జంగ మ్మ, ఉపసర్పంచ్ పెంటయ్య, నాయకులు పాశం గోపాల్, సుభాన్చారి, రాజు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.