వనపర్తి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లాభసాటి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నా రు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామ రైతు శ్రీకాంత్రెడ్డి పొలంలో ప్రత్యామ్నాయ పంట గా వేసిన సీతాఫలం పండ్లను శనివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంప్రదాయ సాగు నుంచి కర్షకులు బయటకు రావాలని సూచించారు. నూనె, పప్పు గింజలు, ఉద్యానవన పం టలతో రైతులకు అధిక ఆదాయం వస్తున్నదని చెప్పారు.
ఉద్యానవనశాఖ సబ్సిడీపై నాణ్యమైన కూరగాయల నారును అందించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలను రైతులు స్వీకరించాలన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి అందుబాటులో ఉన్నారని తెలిపారు. సీతాఫలం పండించిన రైతు శ్రీకాంత్రెడ్డిని మంత్రి అభినందించారు. మంత్రి ప్రోత్సాహంతో చిన్నమందడి గ్రామం లో 200 మంది రైతులు కూరగాయలు పండిస్తున్నారని రైతు తెలిపాడు.