పెద్దమందడి, డిసెంబర్ 16 ; వానకాలం పంటలు పూర్తిగా ముగియడంతో ఎన్నో ఆశలతో అన్నదాతలు యాసంగి వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సాగులో రైతులు ఎకువగా దొడ్డు రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. చలిప్రభావం నారుమళ్లపై పడకుండా ప్రత్యేక నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక రకాలైన (120-130 రోజుల పంట కాలం) 1010, కేఎన్ఎం (118), ప్రైవేటు కంపెనీలోని స్వల్ప కాలం వంటి రకాలను సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. చలి ఉధృతిని బట్టి పంటకాలం 10 నుంచి 15 రోజుల వరకు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా చలి ప్రభావం నారుమళ్లపై పడకుండా ప్రత్యేక నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.
నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి..
రైతులు యాసంగిలో సాగు చేసే వారి విత్తనాలు ఎంపికలో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మండే పెట్టేటప్పుడు చలి లేకుండా వరి విత్తనాలపై గడ్డి బాగా కప్పి పైన కవరు వేసుకుంటే మంచి మొలక వస్తుంది. నారుమడులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి వేసుకోవాలి.
– కురుమయ్య, వ్యవసాయ అధికారి