నర్వ : నారాయణపేట జిల్లా నర్వ మండలం బేక్కర్ పల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ( Electric Shock) రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన భీంసాని రాములు (45) అనే రైతు గురువారం రాత్రి చెరుకు తోటకు నీరు పెట్టేందుకు వెళ్లి పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ కంచెకు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.