వనపర్తి, జనవరి 8 : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. పగటిపూట సాధా రణ ఊష్ణోగ్రతలు నమోదవుతున్నా.. రాత్రి వేళల్లో కనిష్ఠంగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నా యి. ఉదయం 9 గంటలైనా భానుడి దర్శనం ఉండడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చల్లగాలులు వణికిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక రాత్రిళ్లు చలి చంపుతున్నది. ఈ సమయంలో గాలిలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యా ధులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఆస్తమా, నిమోనియా, గుండె వ్యాధులతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యు లు సూచిస్తున్నారు. ఏసీ గదుల్లో ఉన్నా ఆస్తమా సమస్య ఎక్కువవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పిల్లలో ముఖ్యంగా జలుబు, దగ్గును అశ్రద్ధ చేస్తే న్యూమోనియా సోకే ప్రమాదం ఉన్నది. శిశువు లకు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగిస్తే ఊపి రితిత్తుల్లో నిమ్ము చేరకుండా ఉంటుంది.
జాగ్రత్తలు పాటించాలి