నాగర్కర్నూ ల్, మే 6 : నాగర్కర్నూ ల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంట ల నుంచే భానుడి ప్రతాపానికి ప్రజ లు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఉక్కపోతతో ఇండ్ల లో ఉండలేక, బయటకు వెళ్లలేక బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళితే వడగాలుల తాకిడికి గురయ్యే పరిస్థితులు ఉండడంతో అత్యవసరం పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎండ తీవ్రతకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గడంతో వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 40.3 నుంచి 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖాధికారులు తిమ్మాజిపేట, లింగాల, వంగూరు, కల్వకుర్తి, తాడూరు, ఊర్కొండ, వెల్దండ, ఉప్పునుంతల, చారకొండ, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, నాగర్కర్నూల్, బల్మూర్, తెలకపల్లి, కొల్లాపూర్, కోడేరు, అచ్చంపేట మండలాల్లో ని కొన్ని ప్రాం తాలకు ఆరెంజ్ అల ర్ట్ జారీ చేశారు. మిగతా ఐదు మం డలాల్లోనూ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని, తప్పనిసరైతేనే బయటకు రావాలని, వచ్చినా వేడిని తట్టుకునేలా గొడుగు లేదా టోపీలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వదులైన దుస్తు లు లేదా నూలు వస్ర్తాలు ధరించాలని, ప్రతి ఒక్కరూ నీటిని ఎక్కువగా తీసుకోవాలని, చల్లదనానికి మజ్జిగ, శీతల పానీయాలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. వడదెబ్బ లక్షణాలైన తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.