సీఎం కేసీఆర్ రాకకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 4న ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఈమేరకు నిత్యం మహబూబ్నగర్లో పర్యటిస్తూ సూచనలు చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా చూడాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ప్రజలు సీఎం ప్రసంగాన్ని వీక్షించేందుకు స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు. మరో వైపు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి జిల్లాలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్య నాయకులు తరలేలా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు.
– మహబూబ్నగర్, నవంబర్ 28(నమస్తే తె లంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, నవంబర్ 28 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : వచ్చే నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతోపా టు ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాట్లపై ఇటీవల ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి భా రీగా జనసమీకరణ చేయాలని నేతలకు ఆదేశాలిచ్చారు. మిగతా నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్యనేతలు తరలిరావాలని సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నతాధికారులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజలు రావడానికి, వెళ్లడానికి ఇబ్బందు లు లేకుండా చూడాలని పోలీసులకు సూచించా రు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వీఐపీలు వచ్చిపోవడానికి కూడా ఏర్పాట్లు చేయాలన్నారు.
సీఎం సభ సమయంలో ట్రాఫిక్కు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ప్రజలు సీఎం ప్రసంగా న్ని వీక్షించేందుకు అక్కడకక్కడ స్క్రీన్లను ఏ ర్పాటు చేయాలన్నారు. సభకు వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం ఎం వీఎస్ కళాశాల నుంచి డైట్ కాలేజ్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులను మర్లు వద్ద మంత్రి పరిశీలించారు. ఈ రహదారిని విస్తరించ డం వల్ల పట్టణంలో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. ఇదిలా ఉండగా, ఎంవీఎస్ నుంచి ఇటు వన్టౌ న్, అటు భూత్పుర్ వరకు డివైడర్, రహదారికిరువైపులా పచ్చని చెట్లు ఏపుగా పెరిగాయి.
సీఎం ప ర్యటన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది క్లీన్ అం డ్ గ్రీన్ పనులు చేపట్టారు. పట్టణంలో యుద్ధప్రాతిపాదికన రహదారి మరమ్మతులు చేస్తున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవార్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఆర్టీవో ప్రదీప్కుమార్, అర్బన్ తాసిల్దార్ పార్థసారధి ఉన్నారు.
సీఎం షెడ్యూల్