కొత్తకోట, డిసెంబర్ 7: ఆయిల్ట్యాంకర్ను కంటైనర్ ఢీకొట్టిన ఘటన పట్టణ సమీపంలోని టెక్కలయ్య దర్గా వద్ద చోటుచేసుకున్నది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆయిల్ట్యాంకర్ టైర్ ఫంక్చర్ కావడంతో మంగళవారం అర్ధరాత్రి పక్కకు నిలిపి ఉంచారు. అతివేగంగా ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న పార్సల్ కంటైనర్ వచ్చి ఆయిల్ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధం కాగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. సుమారుగా రూ.20లక్షల ఆస్తానష్టం జరిగినట్లు ట్యాంకర్ డ్రైవర్ మోహిన్ తెలిపారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్ను జీపు ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి చౌరస్తాలో బుధవారం చోటుచేసుకున్నది. రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు కథనం మేరకు.. బండమీదిపల్లికి చెందిన కేఎస్ శేఖర్గౌడ్(58) ఇంటినుంచి బైక్పై వెళ్తుండగా, దేవరకద్రవైపు వెళ్తున్న జీపు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు అనిల్గౌడ్ ఫిర్యాదు మేరకు జీపు డ్రైవర్పై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.