మహ్మదాబాద్, జనవరి 10: మండలంలోని వివిధ తండాల్లోని సారా బట్టీలపై మంగళవారం దాడి చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ బాల కృష్ణ తెలిపారు.
ఆయన వివరాల ప్రకారం కని కలకుంటతండా, మంగంపేట్ తండా, షేఖ్పల్లి తండా, బొమ్మికుంట తండా, కొలిమి కుచ్చతండా, సామల కుంటతండా, అన్నారెడ్డిపల్లి తండాలో సారా బట్టీలపై దాడులు నిర్వహించి 9 లీటర్ల సారా, 80 లీటర్ల బెల్లం ఊటను పారబోసి నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా సారా తయారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.