మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 12 : తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. తె లంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహబూబ్నగర్ స్టేడియం గ్రౌండ్స్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పోలీస్ శాఖాధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రన్ను బెలూన్లు, పావురాలను ఎగురవేసి, జెండా ఊ పి మంత్రి ప్రారంభించారు. స్టేడియం మై దానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు 2కే రన్ కొనసాగగా విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతకు ముందు స్టేడియం గ్రౌండ్స్లో మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతే అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో మహబూబ్నగర్లో క్రీడా వసతులు ఏమాత్రం ఉండేవి కాదని గుర్తు చేశారు. నేడు స్టేడియం ఆవరణలో అద్భుతమైన ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాల ఆవరణలో మరో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించినట్లు చెప్పారు. క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రధాన స్టేడియంలో హాస్టల్ వసతి కల్పించి క్రీడాకారులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఆటాపాటలతో పాటు విద్యార్థులు చదువులోనూ చక్కగా రాణించాలని సూచించారు. బాగా చదువుకుంటేనే బంగారు భవిష్యత్ ఉం టుందని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులై సొంతూరికి, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఇంటర్ నుంచి ఐదేండ్లు కష్టపడితే జీవితంలో స్థిరపడుతారని చెప్పారు.
సెల్ఫోన్ను టైం పాస్ కోసం వాడకుండా జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగించాలని సూచించారు. నాడు పాడుబడిన హన్వాడ స్కూల్ చూసేందుకు ఢిల్లీ నుంచి బృందం వస్తున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, మధు, సీఐలు రాజేశ్వర్గౌడ్, ప్రవీణ్, స్వామి, జిల్లా యువజన సంక్షేమాధికారి శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖాధికారి సత్యనారాయణ, డీఎంహెచ్వో కృష్ణ, ఐఎంఏ జిల్లా అ ధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ న ర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, గొర్రెల కాపరుల సం ఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, బిగ్బాస్ ఫేం విశ్వ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.