నవాబ్పేట, జనవరి 19 : మానవుడికి భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మం డలంలోని కొల్లూరులో ఏర్పాటు చేసిన చింతలపురి చిన్మయ స్వామి మఠం రజతోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలి సి ఆలయ ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించా రు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ధార్మిక చింతన కలిగి ఉన్నప్పు డే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మారుమూల గ్రామమైన కొల్లూరులో పెద్ద ఎత్తున ధర్మజాగృతి సభను నిర్వహించడంతో మఠాధిపతి నం దీశ్వర స్వామిని అభినందించారు.
చిన్మయస్వామి మఠం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం శ్రీశైలం పీఠాధిపతి 1008వ జగద్గురు శివాచార్య మహాస్వాములు మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కోరారు. జీవహింస చేయొద్దని, భక్తి భావంతో నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జి. మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాజేశ్రెడ్డి, సర్పంచ్ సౌజన్య, ఉపసర్పంచ్ నర్సింహాచారి, నాయకులు దుశ్యంత్రెడ్డి, రవి, జహీర్అక్తర్, వాసుయాదవ్, రాంచంద్రయ్య, రాజు, రఘు, నీల్యానాయక్, ఖా జా, నవాజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.