దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), అక్టోబర్ 31 : కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి చిన్న చింతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. మండలంలోని గోప్యనాయక్తండా, పర్ణకుంటతండాలో అలాగే నల్లగుట్టతండా, పీతారాంపేటలో మంగళవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరీ, సర్పంచులు హరిత, సుప్రియ ఉన్నారు.
భూత్పూర్, అక్టోబర్ 31 : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధిని సాధిస్తాయని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వెల్కిచర్లలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఆయన మాట్లాడారు. గ్రామాలు ఇంతలా అభివృద్ధి చెందాయంటే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషితోనే అని ఆయన పేర్కొన్నా రు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యే నిరంతరం పోరాటం ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ 55ఏండ్ల కాలంలో చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9ఏండ్లల్లో సాధ్యమైందని తెలిపారు. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని 6, 7, 10, 3వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, ముడా డైరెక్టర్ సాయిలు పాల్గొన్నారు.
దేవరకద్ర, అక్టోబర్ 31 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంతోపాటు మండలంలోని ప్రతి గ్రామంలో గడపగడపకు వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు బాలరాజు పట్టణంలో ఇంటింటికి వెళ్ల్లి ప్రచారం చేశారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
మదనాపురం, అక్టోబర్ 31 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో దూకుడు పెంచారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు రాములు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్నారాయణ, రైతుబంధు జి ల్లా సభ్యుడు రవీందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు కురుమూర్తి, మార్కెట్ డైరెక్టర్ నాగరాజు, మాజీ డైరెక్టర్ వెంకటేశ్యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కొత్తకోట, అక్టోబర్ 31 : మండలంలోని నాటవెల్లిలో మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలపై, ప్రస్తుతం అమలు అవుతు న్న పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే పట్టణంలోని వి విధ వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, వైస్చైర్పర్సన్ జ యమ్మ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, బాలకృష్ణ, బాబురెడ్డి, ప్రసన్నలక్ష్మి, లావణ్య, కౌన్సిలర్లు సంధ్య, పద్మ, రామ్మోహన్రెడ్డి, ఖాజమైనొద్దీన్, కొండారెడ్డి, రాములుయాదవ్, నాగన్నసాగర్, కోఆప్షన్ సభ్యులు వహీద్, వసీం, నగేశ్, నెహ్రూ పాల్గొన్నారు.