నాగర్కర్నూల్, జనవరి 27: విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచే లక్ష్యంతో భువనగిరి జిల్లా వేదికగా నిర్వహిస్తున్న పర్వతారోహణ శిక్షణ ఎవరెస్ట్ టాస్క్లో పాల్గొనేందుకు నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ వసతి గృహాల విద్యార్థినులు శుక్రవారం బయలుదేరినట్లు బీసీ సంక్షేమశాఖాధికారి అనిల్ప్రకాష్ తెలిపారు. పర్వతారోహణ శిక్షణ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో రెండు జిల్లాలకు చెందిన 100మంది విద్యార్థినులు రెండు రోజులపాటు శిక్షణలో పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్రంలోని 26జిల్లాల వసతిగృహాల నుంచి ఎంపిక చేసిన 2600మంది బాలబాలికలకు రెం డు బ్యాచ్లుగా భువనగిరి రాక్ ైక్లెంబింగ్ స్కూల్ పర్యవేక్షణలో పర్వతారోహణలో శిక్షణ ఇస్తారన్నారు. వసతి గృహాల బాలబాలికలను పలురంగాల్లో తీర్చిదిద్దేందుకు ఎవరెస్ట్ టాస్క్తో సాహస క్రీడల్లో భాగంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సహాయంగా సహాయ సంక్షేమాధికారి శ్రీధర్జీ, వసతిగృహాల వార్డెన్లు శిక్షణకు తరలివెళ్లినట్లు తెలిపారు.