ఊట్కూర్, డిసెంబర్ 15 : మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం పేదవిద్యార్థులకు వరమని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వారం మహేశ్గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు. పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం జీవో 47ను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఇన్నాళ్లు విద్యార్థులు అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని దూర ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చేదన్నారు. సీఎం కేసీఆర్ను కలిసి ని యోజకవర ్గకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
హర్షణీయం
పట్టణానికి ప్రభుత్వ డి గ్రీ కాలేజీ మంజూరుపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయ కుడు, అడ్వాకేట్ తిమ్మన్న గురువారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా కల గా మిగిలిన డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి ప్రత్యేక కృషి వల్ల మంజూరు అయిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజీ మంజూరు చేయడంతో ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల వి ద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి తో డ్పడిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూ రు కావడంపై సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిట్టెంకు ప్ర త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
విజయోత్సవ ర్యాలీ
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను మంజూరు చేస్తూ తెలంగాణ విద్య శాఖ జీవో నెంబర్ 47 విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ అ న్నారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి గురువారం విజయోత్సవ ర్యా లీ చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడు తూ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థి సం ఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిట్టెంకు ఎన్నోసార్లు వినతిపత్రాలు అందజేశామన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎమ్మె ల్యే చిట్టెం సీఎం కేసీఆర్తో చర్చించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించడం ఆనందదాయకమన్నారు. అందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చి ట్టెంకు కృతజ్ఞభినందనాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భగవంతు, ఈఫ్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు భుట్టో, పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు, సహాయ కార్యదర్శులు, నాయకులు, విద్యార్థులు ఉన్నారు.
పలువురు నాయకుల హర్షం
ప్రభుత్వ డిగ్రీ కశాళాలను ఏర్పాటు అయ్యే వి ధంగా కృషి చేసిన ఎమ్మెల్యే చిట్టెంకు పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు గురువారం ప్ర కటనలో కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చే శారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యా ర్థులకు అవకాశం ఏర్పడిందన్నారు.