పెబ్బేరు, జనవరి 11: పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హార్స్ కో, యునైటెడ్ వే సహకారంతో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన 10పడకల అత్యవసర కొవిడ్ చికిత్స వార్డును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, జిల్లా వైద్యాధికారి చందూనాయక్ మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యూహంతో తెలంగాణ ప్రభుత్యం ముందుకుసాగుతున్నదని, వనపర్తిలో మెడికల్ కళాశాలతో 600 పడకల దవాఖాన, ఇప్పటికే నర్సింగ్ కళాశాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. కొవిడ్ అత్యవసర చికిత్సకు వనపర్తిలో వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీసాయినాథ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, సింగిల్ విండో చైర్మన్ కోదండరాంరెడ్డి, పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.