అలంపూర్, ఏప్రిల్ 18 : కొత్త మండలంగా ఎర్రవల్లి ఏర్పాటు కానున్నది. గెజిటను విడుదల చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల్లోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రజలకు జీవోలో సూచించింది. ప్రస్తుతం మండలంలోని బొచ్చు వీరాపురం, పుటాన్దొడ్డి, రాజశ్రీ గార్లపాడు, కారపాకులు, సాసనూల్, ధర్మవరం, కొండేర్, వేముల, తిమ్మాపూర్ రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా 14 గ్రామ పంచాయతీలతో నూతన మండలం ఏర్పాటు కానున్నది. దినదినాభివృద్ధి చెందుతూ.. హైవే-44పై ఉన్న ఎర్రవల్లి గ్రామం ఉండడం.. 10వ బెటాలియన్ ఉండడం.. కృష్ణానది పరీవాహక ప్రాంతం.. బీచుపల్లి పుణ్యక్షేత్రం ఉండడంతో వేగంగా అభివృద్ధి జరుగుతున్నది. అందుకే మండలంగా ఏర్పాటు అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నా.. మొదటి విడుతలో అవకాశం దక్కలేదు. అయి తే పట్టువదలని విక్రమార్కుల్లా ఎమ్మెల్యే అబ్రహం, మండల సాధన సమితి సభ్యులు కృషి చేస్తూ వచ్చారు.
పలు సందర్భాలో ప్రభుత్వానికి మండల ఆవశ్యకతను వివరించారు. చివరకు వారి ప్రయత్నాలు ఫలించి చిరకాల స్వప్నం నెరవేరనున్నది. అలంపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏడు మండలాలు ఉండగా.. కొత్తగా మరోటి రానున్నది. దీంతో స్థానికులు సంబురాల్లో మునిగిపోయారు. ఎర్రవల్లి చౌరస్తాలో పటాకులు కాల్చారు.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల కోసమే ప్రభుత్వ నిర్ణయం
ప్రజల కోరిక మేరకు పలుమార్లు సీఎం కేసీఆర్ను, మం త్రులను కలిసి ఎర్రవల్లిని మండలం చేయాలని విన్నవించాను. ప్రజా అవసరాల దృష్ట్యా మండల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాను. పార్టీలకతీతంగా సాధన స మితి ఆధ్వర్యంలో పలు ప్రయత్నాలు చేశారు. చిన్న మండలాలతోనే అభివృద్ధి వేగవంతం అవుతుందన్న ఆ లోచనలతో మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగానే ఉండేది. దీంతో నేను ప్రయత్నించడంతో సఫలీకృతుడనయ్యాను. – ఎమ్మెల్యే అబ్రహం